ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ట

 



టి. సుండుపల్లి మన జనప్రగతి మే 04:- 

మండలంలోని పెద్దబలిజ పల్లి గ్రామం గుట్టకాడ బలిజ పల్లిలో ఘనంగా శ్రీ సీతరాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని మంగళవారం వేదపండితులు దేవరకొండ భానుమూర్తిశర్మ

ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతనంగా నిర్మించిన దేవాలయాలలో శ్రీ సీతారాములు మరియు శ్రీ వీరాంజనేయుల విగ్రహాలను ప్రతిష్టించినట్లు ఆలయ ధర్మకర్త గంటల సిద్దయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కరోనా కష్ట కాలంలో మానవ సమాజాన్ని కాపాడే శక్తి ఒక దైవ శక్తి ఉందని అందరు భక్తిశ్రద్ధలతో నడుచుకుంటే మానవాళికి ఎంతో మంచిదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు