పెద్దపల్లి పంచాయతీలో హైపో క్లోరైడ్ పిచికారీ

 


సిద్ధవటం మన జనప్రగతి మే 04:-

రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సిద్ధవటం మండలం పెద్ద పల్లి పంచాయతీలో గ్రామ సర్పంచ్ తుర్ర చిన్నక్క ఆధ్వర్యంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న కారణంగా పెద్దపల్లి పంచాయతీలోని బొగ్గుడి వారి పల్లి, కనుమలో పల్లి గ్రామాలలో గడపగడపకు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించినట్లు సర్పంచ్ చిన్నక్క తెలిపారు.కరోనా బారిన పడకుండా గ్రామ ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితులలో అవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు అని ఆమె అన్నారు. తప్పనిసరి పరిస్థితులలో బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తరచుగా చేతులను శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలి అన్నారు.