నిరుపేద కుటుంబానికి చేయూత

 


మైదుకూరు మన జనప్రగతి మే 04:- చెందిన శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ జిల్లాలో పలు ప్రాంతాల్లో తమ సేవా కార్యక్రమాలతో నిరుపేదలను ఆదుకుంటుంది. మంగళవారం గాయత్రి సేవా ట్రస్ట్ ఛైర్మన్ డా. నిగినే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరు 39వ వార్డులోని కుమ్మరి కొట్టాలలో నివాసం ఉంటున్న మంగపట్నం నాగలక్ష్మి అనే నిరుపేదరాలుకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం చేయడం జరిగింది.వివరాలకు వెళితే మంగపట్నం నాగలక్ష్మి అనే నిరుపేదరాలు ముగ్గురు చిన్న పిల్లలతో కుటుంబ పోషణ చేస్తూ ఇబ్బంది పడుతుంది. గత ఏడాది భర్త నరసింహులు మరణించడంతో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని గమనించిన స్థానిక వికసితా పౌండేషన్ ఛైర్మన్ శూలం లక్ష్మి దేవి ఈ విషయాన్ని మైదుకూరుకు చెందిన శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ దృష్టికి తీసుకొని వెళ్లడంతో వెంటనే స్పందించిన శ్రీ గాయత్రి ట్రస్ట్ ఛైర్మన్ డా నిగినే వెంకటేశ్వర్లు బాధితులురాలికి 25 కిలోల సోనామసురా బియ్యన్ని, నెలకు సరిపడ నిత్యావసర వస్తువులు అందివ్వడం జరిగింది.